Pages

Subscribe:

Ads 468x60px

Monday, 6 August 2012

అన్ని హృదయ రోగాలకు అమలక రసాయనం


దేశవాళీ ఉసిరి పండ్ల పై బెరడు 100గ్రా, తెల్లమద్దిచెట్టు బెరడు పొడి 100గ్రా, పటికబెల్ల పొడి 100గ్రా, తీసుకుని మూడింటిని కలిపి పలుచని నూలుబట్టలో వస్త్రఘలితం పట్టి నిలువ చేసుకోవాలి.  రోజు రెండు పుటలా ఆహారానికి రెండు గంటలు ముందుగా 6గ్రా, మోతాదులో మంచి నీటితో లోనికి సేవించాలి.
దీని వల్ల అతికొద్ది రోజుల్లోనే గుండె దడ, డుండె అదురు, గుండెనొప్పి, గుండెలో బరువు, గుండెలో సూదులు గుచ్చినట్లు నొప్పి మొదలయిన గుండె సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది హానిరహిత మయిన ప్రతిభావంత మయిన ఆహార ఔషదం.
ఈ ఆహార ఔషదం కేవలం గుండె వ్యాధులకు తగ్గించడమేకాక గుండెకు అమితమయిన బలం కలిగిస్తుంది.  చాలా కాలం నుండి గుండె జబ్బులతో భాధపడే వారు చైత్ర మాసం లో గాని, అశ్విని మాసం లో కాని ఆ మాసం రోజులో సేవిస్తే ఆ వ్యాదినుండి బయట పడగలుగుతారు.
ఉసిరిక చుర్నాని రోజు సేవిచడం వలన రక్తహినులు అయిన నాడులు ఎప్పటికప్పుడు పరిసుభ్రమవుతాయి. రాయి లాంటి గట్టిపడిన రక్త నాడుల గోడలు తిరిగి మృదువుగా సహజ రూపాన్ని సంతరించుకుంటాయి.  కాబట్టి ఇన్ని లాభాలున్న ఈ చక్కని సులభమయిన ఒకే ఒక్క మార్గం ద్వారా మా ప్రియమయిన బిడ్డలంతా గుండె వ్యాదులనుండి రక్షింపపడాలని కోరుతున్నాం.

తెల్లమద్ది చెట్టు


ఉసిరికాయలు
పటికబెల్లం (కండ చెక్కర)


మూలం : అందరికి ఆయుర్వేదం
మాసం : ఆగస్టు 2012

0 comments:

Post a Comment