వెన్నుసమస్యలన్నిటికీ అసలు కారణం శరీరంలో వాతం పెరిగిపోవడమే. ఆ వాతం వాయు రూపంలో ఉండడం వల్ల ఏ స్కానింగ్లోనూ కనిపించదు. ఏమీ కనిపించలేదని నార్మల్ అని వదిలేస్తే, కొద్ది రోజుల్లో సమస్య విషమించిపోతుంది. కనిపించలేదని వాతాన్ని వదిలేసి సర్జరీకి సిద్దమైతే, వెన్నునొప్పి తగ్గక పోగా మరికొన్ని కొత్త సమస్యలు మొదలవుతాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ వర్థన్, డాక్టర్ మాధురీ వర్థన్....
నడుము నొప్పి సమస్యకు చాలా కాలం దాకా సరియైన వైద్య చికిత్సలు అందకపోతే ఏమవుతుంది? ఎన్నోరకాల దుష్ప్రభావాలు తలెత్తి సమస్య క్రమంగా, మరింత సంక్లిష్టమైపోతుంది.







